: కాసేపట్లో రాష్ట్రపతితో నరసింహన్ భేటీ

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయిన ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆయనకు వివరించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన అంశంతో పాటు పలు అంశాలపై ఆయన మోదీతో చర్చించారు. మరికాసేపట్లో నరసింహన్ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ కానున్నట్లు సమాచారం. నరసింహ‌న్‌ను ఢిల్లీకి రావాల‌ని కేంద్రం ఆదేశించిన విష‌యం తెలిసిందే. నిన్న సాయంత్రం హైద‌రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. పర్యటనలో భాగంగా ఆయ‌న కేంద్ర‌ హోం శాఖ అధికారులను కూడా క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News