: భాగ్యనగరంలో ఎడతెరపిలేని వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం

భాగ్యనగరంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దఅంబర్‌పేట, అనాజ్‌పూర్, అబ్దుల్లాపూర్‌మెట్, కూకట్‌పల్లి, మియాపూర్, లింగంపల్లి, ఖైరతాబాద్, సోమాజీగూడ, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామవుతోంది. కాగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తం చేశారు.

More Telugu News