: అంతకంటే సిగ్గుమాలిన వ్యవహారం చంద్రబాబుగారి చరిత్రలో మరొకటి ఉండదు: వైఎస్సార్సీపీ నేత పార్థసారధి

ఏపీక ప్రత్యేక ప్యాకేజ్ ను ఆమోదించారంటే అంతకంటే సిగ్గుమాలిన వ్యవహారం ఈ రాష్ట్రంలో మరొకటి ఉండదని వైఎస్సార్సీపీ నేత పార్థసారధి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘సీఎం చంద్రబాబు నాయుడుగారు ఆ రోజు రాత్రి 12 గంటలకు మీడియా కాన్ఫరెన్స్ పెట్టేసి, ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ను ఆహ్వానించారు. అంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం చంద్రబాబు గారి చరిత్రలో ఉండదు. ఏవిధంగా ప్యాకేజ్ ను ఒప్పుకుంటారు? ప్యాకేజ్ లో ఏమిచ్చారన్నది స్పష్టంగా చెప్పారా? పోలవరం, రాజధాని, లోటు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ విభజన చట్టంలో లేనివా? మీరేమన్నా కొత్తగా ఇస్తున్నారా? పోలవరంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్నది మా డిమాండ్’ అని పార్థసారధి అన్నారు.

More Telugu News