: అమెరికాలో మరోసారి కాల్పుల అలజడి.. ఒకరి మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల అలజడి చెలరేగింది. ఆ దేశంలోని బర్మింగ్‌హామ్‌, గేట్‌సిటీలోని పబ్లిక్‌ హౌసింగ్‌ కమ్యూనిటీ వద్ద శాంతి ర్యాలీ జరిగింది. అనంత‌రం ఆ ప్రాంతంలో దుండ‌గులు కాల్పులు జ‌రిపి, వెంట‌నే అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల్లో ర్యాలీని చూసేందుకు వచ్చిన ఆరుగురు పౌరులకు గాయాల‌య్యాయి. వెంట‌నే వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే చికిత్స పొందుతున్న వారిలో ఒకరు మృతి చెందినట్లు అక్క‌డి పోలీసులు పేర్కొన్నారు. కాల్పుల ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దుండ‌గుల గురించి గాలిస్తున్నారు.

More Telugu News