: న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు భారత జట్టు ఇదే!

న్యూజిలాండ్ తో జరిగే టెస్టు సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ ఉదయం సమావేశమైన సెలక్షన్ కమిటీ జట్టులో ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇటీవలి కాలంలో రాణించలేకపోతున్న రోహిత్ శర్మను తొలగిస్తారన్న వార్తలు వచ్చినప్పటికీ అతన్ని జట్టులో కొనసాగించింది. జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, మురళీ విజయ్, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్. కాగా, భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య తొలి టెస్టు ఈ నెల 22 నుంచి కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఆపై 30 నుంచి అక్టోబర్ 4 వరకూ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో, ఆఖరి టెస్టు ఇండోర్ లోని సరికొత్త హోల్కర్ స్టేడియంలో జరగనున్నాయి.

More Telugu News