: విమానాల్లో శ్యాంసంగ్ గెలాక్సీ నోట్-7కు నో ఎంట్రీ!... కీలక నిర్ణయం తీసుకున్న డీజీసీఏ!

స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శ్యాంసంగ్ తో పాటు ఆ కంపెనీ తాజా మోడల్ గెలాక్సీ నోట్-7 వాడుతున్న వారికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాకిచ్చే వార్తను మోసుకొచ్చింది. అన్ని విమాన సర్వీసుల్లో గెలాక్సీ నోట్-7ను అనుమతించబోమని సదరు సంస్థ నిన్న కీలక ప్రకటన చేసింది. చార్జింగ్ పెడుతున్న సందర్భంలోనే కాకుండా ఇతర సందర్భాల్లోనూ గెలాక్సీ నోట్-7 పేలిపోతున్న విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని ఆసరా చేసుకుని డీజీసీఏ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని విమాన సర్వీసులకూ ఈ నిబంధన వర్తిస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. విమానాల్లో ప్రమాదాల నివారణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రయాణికులు సహకరించాలని ఆ సంస్థ కోరింది.

More Telugu News