: ఢిల్లీలో తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని విడుదల చేసిన క్రికెటర్ గేల్

ప్రముఖ క్రికెటర్ క్రిస్ గేల్ స్వీయ చరిత్ర (ఆటోబయోగ్రఫీ) పుస్తక విడుదల కార్యక్రమం ఈ రోజు ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ హజరై, పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గేల్ మాట్లాడుతూ, తన ఆటోబయోగ్రపీని చదివితే యువకులు, క్రికెట్ అభిరుచి ఉన్నవారు స్పూర్తి పొందుతారని అన్నాడు. తన బ్యాటింగ్ లాగే ఈ పుస్తకం కూడా వినోదం పంచుతుందని గేల్ తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా స్పూర్తి కలిగించే వ్యక్తిగా ఉండాలని తాను కోరుకుంటానని గేల్ తెలిపాడు. అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, క్రిస్ గేల్ లాంటి వ్యక్తులు క్రికెట్‌ కు నిజమైన బ్రాండ్ అంబాసిడర్‌ లని అన్నారు.

More Telugu News