: నాగార్జున వర్శిటీలో మళ్లీ ర్యాగింగ్ కలకలం.. ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్

గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీలో మరోసారి ర్యాగింగ్ భూతం రెచ్చిపోయింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. యూనివర్శిటీలో బీటెక్ రెండో సంవత్సరం ఈసీఈ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మొదటి సంవత్సరం సివిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ జయంత్ ను నిన్న రాత్రి ర్యాగింగ్ చేశారు. ఈ విషయమై స్పందించిన యూనివర్శిటీ ప్రిన్సిపల్ ఆచార్య పి.సిద్ధయ్య మాట్లాడుతూ, ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులను సస్పెండ్ చేశామన్నారు. ర్యాగింగ్ కు పాల్పడిన శంకర్, నవీన్, వెంకట కృష్ణ, కల్యాణ్, మనోజ్ కుమార్ ను హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News