: పవన్ 'ఆత్మగౌరవ' సభకు తరలివెళ్లిన తెలంగాణ యువత

కాకినాడలో నేటి సాయంత్రం 4 గంటలకు జరగనున్న హీరో పవన్ కల్యాణ్ సీమాంధ్ర ఆత్మగౌరవ సభకు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ధర్మపురి, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన యువత ఇప్పటికే కాకినాడలోని జేఎన్టీయూ మైదానానికి చేరుకుంది. తామంతా పవన్ వీరాభిమానులమని, ఆయనేం మాట్లాడతారో వినేందుకే వచ్చామని వీరంతా చెబుతున్నారు. మరోవైపు సభకు ఇంకా ఆరు గంటల సమయం ఉన్నప్పటికీ, వేదిక వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ఈ సభకు మూడంచెల బారికేడ్లు, భద్రతను ఏర్పాటు చేసిన పోలీసు వర్గాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా నగరమంతా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.

More Telugu News