: ‘కిసాన్‌ యాత్ర’లో భాగంగా రేపు అయోధ్యలో పర్యటించనున్న రాహుల్ గాంధీ

బాబ్రీమసీదు కూల్చివేసినప్పటి నుంచి (1992) ఇప్ప‌టి వ‌ర‌కు అయోధ్యలో పర్యటించని గాంధీ కుటుంబం మళ్లీ తొలిసారిగా ఆ ప్రాంతంలో కాలు పెట్టనుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన‌ ‘కిసాన్‌ యాత్ర’లో భాగంగా రేపు అయోధ్య‌లో ఆయన అడుగుపెట్ట‌నున్నారు. అయోధ్య ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాహుల్ అక్క‌డి హనుమాన్‌ గర్హి దేవాలయంలో పూజల్లో పాల్గొంటారు. అయితే, రామజన్మభూమి- బాబ్రి మసీదు స్థలాన్ని రాహుల్ గాంధీ సందర్శిస్తారా? అన్న అంశంపై సందిగ్ధ‌త ఏర్ప‌డింది. 1990లో భార‌త‌ మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హనుమాన్‌ గర్హి దేవాలయాన్ని దర్శించుకోవాలని అనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు.

More Telugu News