: భారతీయులు, పాకిస్తానీయులు, నల్లజాతివారికి దూరంగా ఉండండి: 'ఎయిర్ చైనా' మేగజైన్ లో విద్వేషపూరిత రాతలు

చైనా అధికార ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ చైనా, తన ఇన్ ఫ్లయిట్ మేగజైన్ లో భారతీయులు, పాకిస్తానీయులు, నల్లజాతివారిపై అక్కసు వెళ్లగక్కింది. ఈ విషయాన్ని విమానంలో ప్రయాణించిన చైనాకు చెందిన ఓ జర్నలిస్టు వెలుగులోకి తెచ్చారు. చైనా నుంచి బ్రిటన్ వెళుతున్న ఓ విమానంలో ఉన్న ఈ మేగజైన్ లో "సాధారణంగా ప్రయాణాలకు లండన్ సురక్షితం. కానీ, మీరు భారతీయులు, పాకిస్థానీయులు, నల్లజాతి వారు అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని సూచిస్తున్నాం. రాత్రి పూట చైనా టూరిస్టులు ఒంటరిగా తిరగవద్దు. ముఖ్యంగా తోడు లేకుండా మహిళలు అస్సలు ప్రయాణాలు చేయవద్దు" అని ఉంది. దీన్ని చూసిన మహిళా జర్నలిస్ట్ హేజ్ ఫాన్, దానిని ఫోటో తీసి "వార్నింగ్ టు లండన్ మేయర్ సాదిక్ ఖాన్" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని సీఎన్బీసీ వెబ్ సైట్ కు కథనంగా ఇచ్చారు.

More Telugu News