: ప్రత్యేక హోదాపై మధ్యాహ్నం సీఎం చంద్రబాబు ప్రకటన

ప్రత్యేక హోదా లేదు ప్యాకేజీతోనే సరిపుచ్చుకోండంటూ కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేయడంతో సీఎం చంద్రబాబు స్పందించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు దీనిపై ప్రకటన చేయనున్నారు. కాగా, సీఎం ఏం మాట్లాడతారన్న ఆసక్తి నెలకొంది. ప్రత్యేక హోదానే తమకు సమ్మతమని, ప్యాకేజీకి ధన్యవాదాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామంటూనే, హోదాకు సమాన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాత్రి ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

More Telugu News