: వచ్చే ఏడాది భోగి రోజున ‘ఖైదీ నంబర్ 150’

‘బాస్ ఈజ్ బ్యాక్’ ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది భోగి రోజున విడుదల చేస్తామని దర్శకుడు వివి వినాయక్ ప్రకటించారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ లో విద్యాగణపతిని ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘భోగి’ రోజున విడుదలయ్యే ఈ చిత్రం కేవలం అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుందని వినాయక్ చెప్పారు. కాగా, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి నిర్మాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.

More Telugu News