: ఆయన మా పరువు తీస్తున్నారు!: 'ఆప్' ఎమ్మెల్యేపై పంజాబ్ మహిళా నేత ఫిర్యాదు

ఆమ్ ఆద్మీ పార్టీలో మరో దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఈ దఫా ఆరోపణలు చేసింది ఎవరో కాదు, పంజాబ్ ఆప్ మహిళా విభాగం అధ్యక్షురాలు బల్జీందర్ కౌర్ స్వయంగా రాష్ట్ర మహిళా కమిషన్ కు ఆప్ ఢిల్లీ ఎమ్మెల్యే దేవేందర్ సెహ్రావత్ పై ఫిర్యాదు చేశారు. ఆయన పంజాబీ మహిళల పరువును తీసేలా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపించారు. కొందరు ఆప్ నేతలు దాష్టీకాలకు దిగుతున్నారని, టికెట్లు అడుగుతున్న మహిళలను కోరిక తీర్చాలని అడుగుతూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవలే సెహ్రావత్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీన్నే ప్రస్తావిస్తూ, అటువంటి సంఘటనలేవీ జరగకపోయినా, సెహ్రావత్ ఇలా లేఖలు రాసి తమ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని టికెట్ ఆశిస్తున్న మహిళలు వాపోయారు. సెహ్రావత్ ఆరోపణలు నిరాధారమని బల్జీందర్, పరమ్ జిత్ కౌర్ లు అన్నారు.

More Telugu News