: ‘హోదా’తోనే ఏపీకి పరిశ్రమలు!... సొంత ప్రయోజనాల కోసమే ప్యాకేజీకి చంద్రబాబు మొగ్గు!: ఆర్కే రోజా

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చేసిన నేపథ్యంలో వైపీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో జరిగిన వైసీఎల్పీ భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం తేల్చేసినా... సీఎం చంద్రబాబు మాత్రం కేంద్రం వెంటే నడుస్తున్నారని ఆమె ఆరోపించారు. తన సొంత ప్రయోజనాల కోసమే... చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆమె మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తేనే ఏపీకి పరిశ్రమలు వస్తాయని ఆమె చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నిజాయతీగా ఎవరు పోరాడినా మద్దతిస్తామన్నారు.

More Telugu News