: తుని ఘటనలో నా ప్రమేయం లేదు!... కాపు ఉద్యమాన్ని నీరుగార్చేందుకే కేసులు!: భూమన

తూర్పు గోదావరి జిల్లా తునిలో ఈ ఏడాది జనవరిలో జరిగిన కాపు ఐక్య గర్జనలో చోటుచేసుకున్న విధ్వంసంలో తన ప్రమేయం ఎంతమాత్రం లేదని వైసీపీ కీలక నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ కేసులో సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యేందుకు గుంటూరు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం కాపులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు బనాయించిందని ఆయన ఆరోపించారు.

More Telugu News