: తెలంగాణ ఉద్యమ సమయమే టఫ్ టైమ్!... సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంపై రోశయ్య కామెంట్!

తమిళనాడు గవర్నర్ గా పదవీ కాలం ముగించుకున్న సీనియర్ రాజకీయవేత్త, ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య నిన్న హైదరాబాదు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రైవేటు న్యూస్ ఛానెల్ తో తన అనుభవాలను పంచుకున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను పెద్దగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోలేదని చెప్పారు. అయితే అతి తక్కువ కాలమే తాను సీఎంగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఎగసిపడిందన్నారు. ఆ సమయమే తన రాజకీయ జీవితంలో తాను ఎదుర్కొన్న గడ్డుకాలం (టఫ్ టైమ్) అని ఆయన పేర్కొన్నారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేది లేదని ఇప్పటికే స్పష్టం చేసిన రోశయ్య... తన శేష జీవితం హైదరాబాదులోనే కొనసాగిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

More Telugu News