: కేజ్రీ సర్కారు చాయ్, సమోసా ఖర్చు కోటికి పైనేనట!... దుబారాలో ఎవరికీ తీసిపోని ఢిల్లీ ప్రభుత్వం!

దుబారాలో ప్రభుత్వాధినేతలు ఒకరు మరొకరకి తీసిపోవడం లేదు. రాజకీయాల్లోని అవినీతిని పారదోలుతానంటూ కొత్తగా రంగప్రవేశం చేసిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇందుకు అతీతులేమీ కాదు. గడచిన ఏడాదిన్నర కాలంలో చాయ్, సమోసాల కోసమే కేజ్రీ సర్కారు ఏకంగా రూ.1 కోటికి పైగా ఖర్చు చేసిందట. ఈ ఖర్చులో ఒక్క కేజ్రీ ఖర్చే రూ.47 లక్షలుందట. ఇక కేజ్రీ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న మనీశ్ సిసోడియా రూ.17 లక్షలు ఖర్చు చేశారు. ఇక కేజ్రీ కేబినెట్ లోని మిగిలిన మంత్రులు కూడా తామేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. కేజ్రీ, సిసోడియాలు మినహా ఢిల్లీ కేబినెట్ లోని మంత్రులు ఏడాదిన్నర కాలంలో చాయ్, సమోసాల కోసం రూ.36 లక్షలు వెచ్చించారు. ఈ నిధులను వారంతా తమను కలిసేందుకు వచ్చిన వారికి చాయ్, సమోసాలు అందించేందుకే ఖర్చు చేశారు. వివేక్ గర్గ్ అనే ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు వచ్చిన సమాధానంలో ఈ ఆసక్తికర అంశాలున్నాయి.

More Telugu News