: ఈ భూమిని ఉగ్రవాదులు ఏమీ చేయలేరు... వారి ఆటలు సాగవు!: రాజ్ నాథ్ సింగ్

ఈ భారత భూమిని ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మావోయిస్టులు ఎవరూ ఏమీ చేయలేరని కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాదులోని రాజేంద్రనగర్ నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ భద్రతకు ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వం అంతా చేస్తుందని అన్నారు. దేశ రక్షణకు వీర జవాన్లు నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన వారి సేవలను కొనియాడారు. వారి త్యాగాల ముందు ఉగ్రవాదం, తీవ్రవాదం ఆటలు సాగవని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దుల్లోను, సరిహద్దుల లోపల, సముద్రం, గగనతలం ఇలా దేశానికి నలువైపుల వీర జవాన్లు రక్షణగా నిలిచి పహారా కాస్తున్నారని ఆయన వారి సేవలను ప్రస్తుతించారు.

More Telugu News