: కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్న సిద్ధూ

ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన ఎంపీ నవజ్యోతి సింగ్ సిద్ధూ తనే ఓ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. ఈ నెల 9న ఆవాజ్-ఇ-పంజాబ్ అనే రాజకీయపార్టీని సిద్ధూ ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు సిద్ధూను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. ఏ పార్టీ వైపు సిద్ధూ మొగ్గుచూపుతాడనే విషయమై ఆయన అభిమానులు, రాజకీయ నేతల్లో నెలకొన్న ఆసక్తికి దీంతో తెరపడినట్లయింది.

More Telugu News