: చంద్రబాబు చరిత్రంతా నేరమయం!... ఏపీ సీఎంపై వైసీపీ నేత భూమన ధ్వజం!

తుని విధ్వంసం కేసులో తనకు సీఐడీ నోటీసులు అందిన వెంటనే వైసీపీ కీలక నేత, తిరుపతి మాజీ శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి ఘాటుగా స్పందించారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఉండగానే భూమనకు సీఐడీ నోటీసులు అందించింది. సీఐడీ నోటీసులు అందుకున్న తర్వాత కూడా మీడియా సమావేశాన్ని కొనసాగించిన భూమన... చంద్రబాబు వైఖరిపై ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్రంతా నేరమయమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను రాజకీయ ప్రత్యర్థులుగానే చూడాలన్న ఆయన... అందుకు విరుద్ధంగా శత్రువులుగా చూసే నైజాన్ని చంద్రబాబు మానుకోవాలన్నారు. జగన్ ను ఉన్మాదిగా పోల్చడం సరికాదన్నారు. ప్రతిపక్షంపై ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు మొగ్గుచూపుతున్నారని ప్రశ్నించారు.

More Telugu News