: టీ-టీడీపీ నేత విజయ రమణారావుకు బెయిల్... జైలు నుంచి విడుదల

కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు విజయ రమణారావుకు బెయిల్ మంజూరైంది. జిల్లా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాము చేసిన పోరాటం తర్వాతనే పెద్దపల్లి నియోజకవర్గానికి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేశారని అన్నారు. మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావులు తమ ప్రాంతాలకు నీరు తీసుకువెళ్లి మిగతా ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఎస్సారెస్పీలో 18 టీఎంసీల నీరు ఉన్నప్పుడే తాము నీటిని విడుదల చేసే వాళ్లమని, ఇప్పుడు 50 టీఎంసీల నీరున్నా వదలడం లేదని మండిపడ్డారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆపనని విజయరమణారావు అన్నారు.

More Telugu News