: తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ గా విద్యాసాగరరావుకు అదనపు బాధ్యతలు

తమిళనాడు గవర్నర్ గా కొణిజేటి రోశయ్య పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ నేపధ్యంలో రోశయ్య స్థానంలో ఇన్ ఛార్జి గవర్నర్ ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగరరావును తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ బాధ్యతలు అప్పగించింది. కాగా, రోశయ్య పదవీకాలం ముగియనుండడంతో ఆయన పదవీ కాలం పొడిగిస్తారని, ఈమేరకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రానికి లేఖ రాశారంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో ఊహాగానాలకు తెరపడింది.

More Telugu News