: తిరుమల ధర్మగిరి విద్యార్థులపై లైంగిక వేధింపుల కేసులో ఉపాధ్యాయులకు జైలు శిక్ష

తిరుమల ధర్మగిరి విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వేధింపులకు పాల్పడిన నలుగురు ఉపాధ్యాయులు మహేశ్ కన్నన్, అవినాష్, చక్రవర్తి, సుదర్శన్ లకు రెండేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తిరుపతి రెండో అదనపు కోర్టు తీర్పునిచ్చింది. జైలు శిక్షతో పాటుగా వీరికి రూ.2500 చొప్పున జరిమానా కూడా విధించింది. కాగా, తిరుమల ధర్మగిరి వేదపాఠశాల ఉపాధ్యాయులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ 2011 లో విద్యార్థులు తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు.

More Telugu News