: పీవీ సింధు ఇక ఖేల్ రత్న!... అత్యుత్నత పురస్కారాన్ని అందుకున్న తెలుగు తేజం!

నిన్నటిదాకా సాదా సీదా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగానే ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు... రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించడంతో ఒక్కసారిగా స్టార్ షట్లర్ గా మారిపోయింది. ఇప్పటికే రూ.12 కోట్లకు పైగా నగదు నజరానాతో పాటు సర్కారీ ఉద్యోగం, నవ్యాంధ్ర నూతన రాజధానిలో ఇంటి స్థలం, తిరిగేందుకు లక్షల ఖరీదు చేసే బీఎండబ్ల్యూ కారు ఆమె దరి చేరాయి. తాజాగా ఆమె దేశంలో క్రీడాకారులకు అందే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నను కూడా అందుకుంది. డిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఆమె రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంది.

More Telugu News