: ‘జనసేన’ పేరిట వస్తున్న పలువురి ప్రకటనలను నమ్మొద్దంటూ పవన్ కల్యాణ్ కార్యాలయం ప్రకటన

జనసేన పార్టీ పేరిట వివిధ వ్యక్తులు చేస్తున్న ప్రకటనలను నమ్మొద్దంటూ ఆ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘జనసేన’ సంస్థాగత నిర్మాణం పూర్తిగా రూపుదిద్దుకోనందున జిల్లాల్లో, ఇతర ప్రాంతాల్లో ఇంకా పార్టీ అధికార ప్రతినిధులుగా ఎవరినీ నియమించలేదన్నారు. అయితే, జనసేన పార్టీ ప్రతినిధులమంటూ మీడియాలో పలు ప్రకటనలు వస్తున్నాయని, ఆ ప్రకటనలకు, తమకు ఎటువంటి సంబంధం లేదని, అవి తమ పార్టీ అభిప్రాయాలు కావని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవేళ ఏదైనా విషయమై తాము ప్రకటన చేయదలచుకుంటే, పార్టీ లెటర్ హెడ్ పై అధికార ముద్రతో ఆ విషయాన్ని తెలియజేస్తామన్నారు. ఈ విషయాన్ని మీడియాకు ఆ ప్రకటన ద్వారా తెలిపారు.

More Telugu News