: హైదరాబాదులో గుజరాత్ సీఎం... ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నేటి ఉదయం భాగ్యనగరి హైదరాబాదులో ల్యాండయ్యారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం హైదరాబాదు వచ్చిన ఆయన కొద్దిసేపటి క్రితం శంషాబాదు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాదు వచ్చిన ఆయనకు స్థానిక బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రూపానీ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో సమర్ధ పాలన సాగిస్తున్నారని చెప్పారు. రియోలో భారత్ సత్తా చాటిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు నజరానాపై తమ రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

More Telugu News