: న్యూయార్క్ - ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం దారి మళ్లింపు

సాంకేతిక కారణాల వల్ల న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని కజకిస్థాన్ కు మళ్లించారు. మొత్తం 300 మంది ఉన్న ఈ విమానంలో 50 మంది తెలుగువారు ఉన్నారు. కాగా, ఈ విషయమై ఎయిర్ ఇండియా సీఎండీ అశ్విని లోహానితో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

More Telugu News