: హోం మంత్రి బావమరిదినంటూ లక్షలు వసూలు చేసి పరారయ్యాడు!

ఏపీ హోం మంత్రి చినరాజప్ప బావమరిదినంటూ చంద్రమౌళి అనే వ్యక్తి లక్షల రూపాయలు వసూలు చేసుకుని ప్రజలకు టోకరా ఇచ్చాడు. ఈ సంఘటన విశాఖపట్టణంలో జరిగింది. భూ వివాద సమస్యలు పరిష్కరిస్తానంటూ ఆయా వ్యక్తుల నుంచి రూ.39 లక్షలు వసూలు చేసిన సదరు వ్యక్తి పరారయ్యాడు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, హోంమంత్రి చిన రాజప్పను కూడా బాధితులు కలిసి తమ బాధను చెప్పుకున్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంపై ఎటువంటి పురోగతి లేకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

More Telugu News