: మధ్యప్రదేశ్ లో ఇకపై ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు

మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వ విభాగం వూర్జా వికాస్ నిగమ్ ఎల్ఈడీ విద్యుత్ బల్బులను డిస్కౌంట్ పై ప్రజలకు అందించిన పథకం విజయవంతమైంది. దీని స్ఫూర్తితోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ ట్యూబ్ లైట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ట్యూబ్ లైట్లతో పాటు తక్కువ విద్యుత్ ను ఉపయోగించుకునే ఫైవ్ స్టార్ రేటెడ్ ఫ్యాన్లను ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రజలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తోందని రిన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మను శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాగా, ట్యూబ్ లైట్ల ధర సుమారు రూ.320 నుంచి రూ.1,120 వరకు ఉండనున్నట్లు సమాచారం.

More Telugu News