: పుల్లెల గోపిచంద్ వల్లే ఈరోజు నేనిక్క‌డ ఉన్నాను, ఇక్కడికి ఇంతమంది వస్తారనుకోలేదు: సింధు

హైద‌రాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియానికి చేరుకున్న‌ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి సింధుని తెలంగాణ ప్ర‌భుత్వం ఘ‌నంగా స‌న్మానించింది. ఈ సంద‌ర్భంగా సింధు మాట్లాడుతూ ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. పుల్లెల గోపిచంద్ వల్లే ఈరోజు తానిక్క‌డ ఉన్న‌ట్లు ఆమె పేర్కొంది. త‌న‌ను త‌న త‌ల్లిదండ్రులు ఎంత‌గానో ప్రోత్స‌హించారని తెలిపింది. తెలంగాణ ప్ర‌భుత్వానికి సింధు ధ‌న్య‌వాదాలు తెలిపారు. క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి ధ‌న్యవాదాలు అని ఆమె అన్నారు. ఈరోజు స్టేడియంకి ఇంత‌మంది వ‌స్తార‌ని తాను అనుకోలేద‌ని ఆమె వ్యాఖ్యానించారు. బ్యాడ్మింటన్‌లో రాణించి, మ‌రింత ముందుకు వెళ‌తానని చెప్పారు.

More Telugu News