: ప్రసంగిస్తుండగా కుప్పకూలిన సింగపూర్ ప్రధాని

సింగపూర్ జాతీయ దినోత్సవ ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఆ దేశ ప్రధాని లీ లూంగ్ కుప్పకూలిపోయారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన పడిపోగానే పక్కనే ఉన్న మంత్రులు పట్టుకున్నారు. వెంటనే ఆయన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందజేశారు. ప్రస్తుతం లీ లూంగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని సింగపూర్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

More Telugu News