: రేపు హైదరాబాద్ కు పీవీ సింధు... స్వాగత ఏర్పాట్లివే!

రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుని రేపు హైదరాబాద్ కు రానున్న పీవీ సింధుకు ఘన స్వాగతం పలికేందుకు కేసీఆర్ సర్కారు అన్ని ఏర్పాట్లూ చేసింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 8:30 గంటలకు సింధు శంషాబాద్ విమానాశ్రయానికి రానుండగా, జీహెచ్ఎంసీ స్వాగత ఏర్పాట్లను చేయనుంది. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లనూ సింధూకు స్వాగత పోస్టర్లతో అలంకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమెపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించాలని, విమానాశ్రయం నుంచి నగరంలోకి భారీ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆపై గచ్చిబౌలీ స్టేడియంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు హాజరై సింధూను అభినందించనున్నారు. అన్ని దినపత్రికల్లో సింధూకు స్వాగతం పలుకుతూ ప్రకటనలు ఇవ్వాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది.

More Telugu News