: చంద్రబాబు సెల్ఫీల జోరు!... సీఎంతో సెల్ఫీ కోసం ఎగబడ్డ మేనేజ్ మెంట్ స్టూడెంట్స్!

గడచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీల హోరుకు తెర తీశారు. ఆ తర్వాత విదేశీ పర్యటనల్లో ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఆయా దేశాల్లోని ప్రవాస భారతీయులు పోటీలు పడ్డారు. తదనంతరం దేశంలోని పలువురు రాజకీయ నేతలు మోదీ బాటలో సెల్ఫీలతో హోరెత్తిస్తున్నారు. ఇలాంటి వారిలో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కాస్తంత ముందు వరుసలోనే ఉన్నారు. నిన్న విశాఖ వెళ్లిన సందర్భంగా చంద్రబాబు మెడ్ టెక్ పార్కుకు శంకుస్థాపన చేశారు. రహదారి భద్రతపై జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సుకు వచ్చిన మేనేజ్ మెంట్ విద్యార్థులు చంద్రబాబుతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి కనబరిచారు. విద్యార్థుల ఉత్సాహాన్ని గమనించిన చంద్రబాబు కూడా వారితో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపారు.

More Telugu News