: హైదరాబాదు వెటరన్ లను ఏకం చేసిన సింధు

హైదరాబాదు ఎందరో క్రీడాకారులకు పుట్టినిల్లు. సాధారణ ప్రజలకు పెద్దగా తెలియని ట్రెక్కింగ్, సెయిలింగ్, పోలో, షూటింగ్, సైక్లింగ్ వంటి ఆటలు కూడా హైదరాబాదులో చూడవచ్చు. ఈ క్రీడల్లో హైదరాబాదీలకు మంచి ప్రాతినిధ్యమే ఉంది. అయితే ఈ ఆటలకు సంబంధించిన క్రీడాకారులంతా ఒకే వేదికపై కనువిందు చేసే సందర్భాలు అరుదుగా సంభవిస్తుంటాయి. ఫుట్ బాల్, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, షూటింగ్, సైక్లింగ్, పోలో, సెయిలింగ్, ట్రక్కింగ్ వంటి ఆటల్లో ప్రాతినిధ్యం వహించిన వెటరన్ లు పలువురు గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్ వద్ద సందడి చేశారు. ప్రఖ్యాత షూటర్ గగన్ నారంగ్ వంటి వారు, సింధు తల్లిదండ్రులతో ఆడిన ఆటగాళ్లు, వారి నుంచి సలహాలు, శిక్షణ తీసుకున్నవారు ఇలా ఎంతో మంది గచ్చిబౌలి స్టేడయంలో రియో బ్యాడ్మింటన్ మహిళల ఫైనల్స్ వీక్షించేందుకు చేరుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి కూడా గచ్చిబౌలి చేరుకోవడం విశేషం.

More Telugu News