: గోపీచంద్ అకాడమీకి క్యూ కట్టిన మీడియా ప్రతినిధులు

హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల గోపీచంద్ అకాడమీకి దేశంలోని మీడియా ప్రతినిధులంతా క్యూ కట్టారు. రియో ఒలింపిక్స్ లో భారత్ కు ఒక పతాకాన్ని ఖాయం చేసిన పీవీ సింధు ఆటను కవర్ చేసేందుకు దేశంలోని ప్రధాన మీడియా ఛానెల్స్ కు చెందిన ప్రతినిధులంతా గోపీచంద్ అకాడమీకి చేరుకున్నారు. సింధు అద్భుతం చేస్తుందని, స్వర్ణం సాధిస్తుందని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. మీడియా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు, స్థానికులు, అకాడమీ ఆటగాళ్లు గోపీచంద్ అకాడమీకి చేరుకోవడంతో అక్కడ పెద్ద స్క్రీన్, ఇతర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

More Telugu News