: సింధుకి రాష్ట్రపతి, ప్రధాని, రాహుల్, చంద్రబాబు, కేసీఆర్, జగన్ అభినందనలు

రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో ప్రవేశించి, దేశానికి పతకం ఖాయం చేసిన పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పీవీ సింధును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్సీపీ అధినేత జగన్ లతో పాటు, ఇతర రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు. సింధు దేశం గర్వించేలా చేసిందని అంతా కితాబునిస్తున్నారు. ఇదే స్పూర్తిని కొనసాగించి, స్వర్ణం సాధించాలని అంతా ఆకాంక్షిస్తున్నారు.

More Telugu News