: అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్శిటికీ 200 ఎకరాలు కేటాయించాం: ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయానికి 200 ఎకరాల స్థలాన్ని ఏపీ ప్రభుత్వం కేటాయించిందని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. చెన్నై శివార్లలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఈరోజు బయో యంత్ర -2016 సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన మంత్రి కామినేని మాట్లాడుతూ, ఏపీలో అత్యాధునిక వైద్య పరిజ్ఞానం ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజల ముంగిటకు తీసుకు వచ్చేందుకు గాను సరికొత్త టెక్నాలజీతో ముందుకు సాగుతున్నామన్నారు. నవ్యాంధ్ర రాజధానిలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం క్యాంపస్ ఏర్పాటు నిమిత్తం ఆ సంస్థకు కనిష్ట ధరకే రెండు వందల ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు.

More Telugu News