: వైఎస్ జగన్ కు రాఖీ కట్టిన ఆర్కే రోజా!... జగన్ తనకు సొంత అన్న కంటే ఎక్కువని వ్యాఖ్య!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన మహిళా నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా రాఖీ కట్టారు. రక్షా బంధన్ ను పురస్కరించుకుని నేటి ఉదయం హైదరాబాదులోని జగన్ నివాసానికి కూతురితో కలిసి వెళ్లిన రోజా ఆయన చేతికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా జగన్, ఆయన కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సర్కారు కుట్ర పన్ని అసెంబ్లీ నుంచి తనను ఏడాది పాటు బహిష్కరించిన సందర్భంగా జగన్ తనకు అండగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. నాటి నుంచి జగన్ ను తన సొంత అన్న కంటే ఎక్కువగా భావిస్తున్నానని రోజా తెలిపారు.

More Telugu News