: బెజవాడలో వైఎస్ జగన్!... లబ్బీపేట వెంకన్న సేవలో విపక్ష నేత!

కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానం ఆచరించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయలుదేరారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరిన ఆయన కొద్దిసేపటి క్రితం విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. ఆ తర్వాత ఆయన నేరుగా విజయవాడ నగరంలోని లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ వెంకన్నను దర్శించుకున్న ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆశీర్వచనం తీసుకున్నారు. మరికాసేపట్లో పున్నమి ఘాట్ కు వెళ్లనున్న జగన్ అక్కడ పుష్కర స్నానం చేస్తారు.

More Telugu News