: గౌతమితో విభేదాలన్నీ ఒట్టి పుకార్లే: శ్రుతి హాసన్

కమలహాసన్ తాజా చిత్రం 'శభాష్ నాయుడు' సెట్స్ పై, చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ఉన్న ప్రముఖ నటి, కమల్ సహచరి తాడిమళ్ల గౌతమితో గొడవ పెట్టుకున్నట్టు వచ్చిన వార్తలు నిరాధారమైనవని, అవన్నీ పుకార్లేనని కథానాయిక శ్రుతి హాసన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమె తరఫున ఓ స్టేట్ మెంట్ మీడియాకు విడుదలైంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, శ్రుతి ఆయన కుమార్తెగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తన పాత్రకు గౌతమి సెలక్ట్ చేసిన దుస్తులు నచ్చలేదని ఆరోపించిన శ్రుతి, వాదులాట పెట్టుకోగా, మధ్యలో కల్పించుకునేందుకు కమల్ సాహసించలేదని, దీంతో షూటింగ్ ను సైతం నిలిపివేయాల్సి వచ్చిందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనను ఖండిస్తూ, దుస్తులన్నింటినీ చిత్రీకరణ ప్రారంభానికి ముందే సెలక్ట్ చేసి, వాటితో ప్రీ షూట్ కూడా చేసినట్టు శ్రుతి అధికార ప్రతినిధి తాజా స్టేట్ మెంట్ లో వెల్లడించాడు. వారిద్దరి మధ్యా మంచి అవగాహన ఉందని పేర్కొన్నాడు.

More Telugu News