: పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం!... నిన్న ఒక్కరోజే 10 లక్షల మంది పుష్కర స్నానాలు!

కృష్ణా పుష్కరాలకు భక్తజనం పోటెత్తుతోంది. నిన్న తెల్లవారుజామున తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ల వద్దకు ప్రారంభ సమయంలోనే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అక్కడక్కడ నదిలో నీటి స్థాయి తక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల అవాంతరాలు ఏర్పడ్డా... ప్రధాన పుష్కర ఘాట్ల వద్ద మాత్రం భక్త జన సందోహం కనిపించింది. నిన్న రాత్రి పొద్దుపోయేదాకా రెండు రాష్ట్రాల్లోని అన్ని పుష్కర ఘాట్లలో 10 లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

More Telugu News