: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై ఏబీకే ప్రసాద్ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజధాని నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని ఆ పిటిషన్ లో ఏబీకే కోరారు. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాది అరుణేశ్వర గుప్తాను, ‘రాజధాని కట్టుకుంటుంటే అడ్డుకుంటారా?’ అంటూ ప్రశ్నించింది. ఇందుకు స్పందించిన అరుణేశ్వర గుప్తా అదనపు సమాచారాన్ని సమర్పిస్తానని చెప్పగా అందుకు కోర్టుకు తిరస్కరించింది.

More Telugu News