: చైనా పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 21 మంది దుర్మరణం

చైనా పవర్‌ప్లాంట్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. హుబేయి ప్రావిన్స్‌లోని డాంగ్‌యాంగ్ నగరంలో ఉన్న మేడియన్ గాంగ్వూ పవర్ జనరేషన్ కంపెనీలో హైప్రెజర్ స్టీమ్ పైపు గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో 21 మంది అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పేలుడు వెనుక గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

More Telugu News