: దుర్గాఘాట్ లో పెరిగిన నీటిమట్టం

విజయవాడలోని దుర్గాఘాట్ లో నీటిమట్టం పెరిగింది. ఈరోజు సాయంత్రానికి మూడు అడుగుల మేరకు నీటిమట్టం చేరింది. నిన్నటి వరకు ఈ ఘాట్ లో నీటిమట్టం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. రేపటి నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండటంతో భక్తుల రద్దీ అప్పుడే ప్రారంభమైంది. పలు రవాణా మార్గాల ద్వారా విజయవాడ చేరుకున్న భక్తులు స్నానఘాట్లకు చేరుకుంటుండంతో సందడి వాతావరణం నెలకొంది.

More Telugu News