: రాఖీ సావంత్ స్కర్టుపై మోదీ ఫొటోలు

ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమానినంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వివాదాలకు పెట్టింది పేరు. మోదీపై తన అభిమానాన్ని చాటుకోవడానికో లేక వార్తల్లో నిలిచేందుకో తెలియదుగానీ, రాఖీ సావంత్ తాను ధరించిన స్కర్టుపై మోదీ ఫొటోలను డిజైన్ చేయించుకుంది. ఆమె ధరించిన స్కర్టు ముందు, వెనుక భాగాలు మొత్తం మోదీ ఫొటోలతోనే నిండిపోయాయి. ఈ స్కర్టు ధరించి ఇటీవల అమెరికాలో ఒక పార్టీకి ఆమె హాజరైంది. ఈ స్కర్టులో సెక్సీగా పోజులిస్తూ దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. రాఖీ చేసిన పనేమీ బాగోలేదంటూ నెటిజన్లు విమర్శలతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News