: మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో వరుస పేలుళ్లు
మణిపూర్ రాజధాని ఇంఫాల్ పేలుళ్ల మోతతో దద్దరిల్లింది. రెండు వరుస పేలుళ్లతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం ఇంఫాల్లోని బీఎస్ఎఫ్ శిబిరం సమీపంలో ఐఈడీ పేలుడు సంభవించింది. పేలుడుతో గాయపడిన ఏడేళ్ల బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మళ్లీ మధ్యాహ్నం మణిపూర్ యూనివర్సిటీ గేటు వద్ద బాంబు పేలుడు సంభవించింది. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. పేలుళ్లతో ఇంఫాల్లో భారీగా భద్రతాబలగాలు మోహరించాయి. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుళ్లకు సంబంధించి కారణాలపై ఆరా తీస్తున్నారు.