: రిషికేశ్ లో వైఎస్ జగన్!... హోమంలో పాల్గొన్న వైసీపీ అధినేత!

మూడు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... నేటి ఉదయం అక్కడ మాయమై నేరుగా రిషికేశ్ లో ప్రత్యక్షమయ్యారు. అప్పటికే అక్కడకు చేరుకున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను ఆయన తీసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ అక్కడ జరిగిన ఓ హోమంలో పాల్గొన్నారు. ఈ హోమంలో జగన్ తో పాటు ఆయన పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Telugu News