: ఎక్క‌డ ఏం జ‌రిగినా ప్ర‌ధానే స‌మాధానం చెప్పాలంటున్నారు: వెంక‌య్య‌నాయుడు

ఢిల్లీ పాల‌న విష‌యంలో త‌లెత్తిన వివాదాల‌కు కేంద్రాన్ని త‌ప్పుబట్ట‌డం భావ్యం కాద‌ని కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... దేశంలో ఎక్క‌డ ఏ ఘ‌ట‌న‌ జ‌రిగినా ప్ర‌ధానే స‌మాధానం చెప్పాలంటూ ప్ర‌ధానిపై ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధానిపై అన‌వ‌స‌రంగా అటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం మానేయాల‌ని ఆయ‌న సూచించారు. అన్ని విష‌యాల్లోనూ ప్ర‌ధానిని భాగ‌స్వామ్యం చేస్తూ చూపడం స‌రికాద‌ని అన్నారు.

More Telugu News