: 10 శాతం ఈబీసీ రిజర్వేషన్ కోటా చెల్లదన్న గుజరాత్ హైకోర్టు

గుజరాత్ లోని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్ బిల్లు చెల్లదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మే 1న ఆనందీ బెన్ సర్కారు ఆర్డినెన్స్ జారీ చేయగా, దాన్ని గుజరాత్ పేరెంట్స్ అసోసియేషన్ సహా పలువురు వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఆర్డినెన్స్ అమలైతే, సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినట్లవుతుందని వారు తమ వాదన వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం కన్నా దిగువనే రిజర్వేషన్లు ఉండాలని ఆదేశాలున్నాయని గుర్తు చేశారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన కోర్టు, ఆర్డినెన్స్ చెల్లదని తీర్పిచ్చింది.

More Telugu News